విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-09-25T18:25:22+05:30 IST
నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విజయవాడ: నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ వ్యవసాయ, కార్మిక సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నేతలు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంవర్రోడ్లో ప్రదర్శనగా వస్తున్న రామకృష్ణ, మధు, నారాయణ, మాజీ మంత్రి వడ్డేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ తమను అరెస్ట్ చేయడం అన్యాయమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.