గణేష్ నిమజ్జనాలపై కొనసాగుతున్న గందరగోళం
ABN , First Publish Date - 2021-09-12T23:56:14+05:30 IST
నగరంలో గణేష్ నిమజ్జనాలపై గందరగోళం కొనసాగుతోంది. సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై మట్టి విగ్రహాల నిమజ్జనానికి మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనాలపై గందరగోళం కొనసాగుతోంది. సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై మట్టి విగ్రహాల నిమజ్జనానికి మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు. రంగు విగ్రహాలను జీహెచ్ఎంసీ వాహనాల్లో అధికారులు పెడుతున్నారు. దీంతో భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్సాగర్తో పాటు ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల్లో నిమజ్జనం చేయరాదంటే.. గణనాథులను ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్రావు ప్రశ్నిస్తున్నారు.