విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-08T02:42:05+05:30 IST

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ మోహన్

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది అరెస్ట్

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు, కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్జీ పాలిమర్స్‌పై  278, 284, 285, 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది మృతి చెందగా, 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ తాజాగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించింది.

Updated Date - 2020-07-08T02:42:05+05:30 IST