విశాఖలో ప్రైవేటు బస్సులపై రవాణా అధికారుల దాడులు
ABN , First Publish Date - 2022-01-13T13:53:50+05:30 IST
నగరంలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
విశాఖపట్నం: నగరంలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు 30 బస్సులు తనిఖీలు నిర్వహించగా 13 బస్సులపై జరిమానా విధించారు. అనిల్ కుమార్, కోడి వాసు ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డబల్ డ్రైవర్ లేకపోవటం, పరిమితికి పెంచి ప్రయాణికులు ఎక్కించుకోవటంతో జరిమాన విధించారు. శ్రీకృష్ణ, ఆరేంజ్, ఎస్ఆర్కేటీ ట్రావెల్స్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు.