Visakha కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-01-20T17:01:52+05:30 IST
జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా ఉపాధ్యా ఉద్యోగ సంఘాలు చేరుకున్నాయి.
విశాఖపట్నం: జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి వేలాదిగా ఉపాధ్యా ఉద్యోగ సంఘాలు చేరుకున్నాయి. కలెక్టరేట్కు చేరుకునే అన్ని మార్గాల నుంచి ఉద్యోగ సంఘాలు దూసుకొచ్చాయి. పోలీస్ వలయాన్ని చేధించుకుంటూ కలెక్టరేట్ గేటు వద్దకు ఉద్యోగులు చేరుకున్నారు. పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తమను మోసం చేశారంటూ నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు తీవ్ర స్థాయిలో పోరాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.