వైసీపీది చెత్త ప్రభుత్వం: విష్ణుకుమార్ రాజు

ABN , First Publish Date - 2022-01-02T18:57:10+05:30 IST

జగన్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వైసీపీది చెత్త ప్రభుత్వం: విష్ణుకుమార్ రాజు

విశాఖపట్నం: జగన్ సర్కారుపై  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర స్థాయిలో  విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చెత్త మీద పన్ను విధించడం ఏమిటి? ఇది చెత్త ప్రభుత్వమని, ఇలాంటి చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని భవిష్యత్తు‌లో చూడమన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోవాలని చెప్పారు. ఎవరు ఎన్ని సార్లు బాత్రూంకి వెళ్తే... దానికి కూడా పన్నువేస్తారేమో? అని ఎద్దేవా చేశారు. చెత్తపన్నుపై వైసీపీని ప్రజలు ఛీకొడుతున్నారు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఈ విషయం చెప్పాలన్నారు. చెత్త మీద పన్ను ప్రజలపై వేస్తుంటే...మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో మంత్రి బొత్స సత్యనారయణ ఉన్నారు.. బొత్సాని చూస్తుంటే జాలి వేస్తోందని విష్ణుకుమార్ రాజు అన్నారు.

Updated Date - 2022-01-02T18:57:10+05:30 IST