ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN , First Publish Date - 2021-09-18T06:17:19+05:30 IST

వేంసూరు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వకర్మ జయంతిని మర్ల పాడులో నిర్వహించారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి
మర్లపాడులో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలేస్తున్న విశ్వబ్రాహ్మణులు

వేంసూరు, సెప్టెంబరు 17: వేంసూరు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విశ్వకర్మ జయంతిని మర్ల పాడులో నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్య క్షుడు కృష్ణమాచారి, ఆర్‌.కృష్ణమాచారి, ఉపాఽ ద్యక్షులు రామాచారి, రాంబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఏన్కూరులో 

ఏన్కూరు, సెప్టెంబరు 17: మండల కేంద్రమైన ఏన్కూరులో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ కు, గాయత్రిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మండల విశ్వబ్రాహ్మణసంఘం అధ్యక్షుడు ఉరిమెళ్ల లింగాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి షరుతులు లేకుండా బ్యాంకు రుణాలు ఇవ్వాలని, పేద విశ్వబ్రాహ్మణులకు ఇండ్లస్థలాలు, డ బుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో లింగాచా రి, కృష్ణమాచారి పాల్గొన్నారు.

వైరాలో

వైరా, సెప్టెంబరు 17: వైరా గాంధీచౌక్‌లో శుక్రవారం విశ్వబ్రాహ్మణసంఘం మండల అధ్యక్షుడు రుద్రాక్షల నర్సింహాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్‌ చిత్రపటానికి పూజలు చేసి పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దంటోజు వెంకటాచారి, రంగు రూపాచారి, బండారు అనంతాచారి, తూమాటి వీరబ్రహ్మాచారి, శోభనాచారి, సుబ్బాచారి, నాగేశ్వరరావు, లక్ష్మణాచారి, కాంతాచారి, శ్రీరాములు, పాపాచారి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:17:19+05:30 IST