భారత్లో తగ్గిన వివో ఎస్1 ప్రొ ధర
ABN , First Publish Date - 2020-07-03T00:01:04+05:30 IST
‘వివో ఎస్1’ స్మార్ట్ఫోన్ ధర భారత్లో వెయ్యి రూపాయలు తగ్గి రూ.19,990కి దిగొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో
న్యూఢిల్లీ: ‘వివో ఎస్1’ స్మార్ట్ఫోన్ ధర భారత్లో వెయ్యి రూపాయలు తగ్గి రూ.19,990కి దిగొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ రివిజన్ నేపథ్యంలో ‘వివో ఎస్1 ప్రొ’తోపాటు కొన్ని మోడళ్ల ధరలను సవరించింది. వివో ఎస్1ప్రొను ఈ ఏడాది జనవరిలో భారత్లో విడుదల చేసింది. డైమండ్ షేప్ క్వాడ్కోర్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్, ఇన్డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. ‘పోకో ఎక్స్2’, ‘రియల్మి ఎక్స్3’, ‘ఒప్పో ఎఫ్15’లకు పోటీగా దీనిని తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 20,990 కాగా, తాజాగా దీని ధర రూ. 1000 తగ్గడంతో రూ.19,990కి దిగొచ్చింది. మార్చిలో దీని ధర రూ.18,990కి తగ్గినప్పటికీ జీఎస్టీ పెరుగుదలతో దీని ధరను మళ్లీ పెంచింది. తాజాగా ఇప్పుడు వెయ్యి రూపాయలు తగ్గించి రూ. 19,990 చేసింది.
వివో ఎస్1 ప్రొ స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 9పై, 6.38 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా 128 జీబీ స్టోరేజీ, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి.