వోల్వో కార్లు మరింత ప్రియం
ABN , First Publish Date - 2021-05-04T06:24:39+05:30 IST
వోల్వో కార్లు మరింత ప్రియం కానున్నాయి. మోడల్ను బట్టి ఒక్కో వాహనం ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెరిగింది...
- ఒక్కో కారుపై రూ.2 లక్షల వరకు భారం
న్యూఢిల్లీ: వోల్వో కార్లు మరింత ప్రియం కానున్నాయి. మోడల్ను బట్టి ఒక్కో వాహనం ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెరిగింది. సోమవారం నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వోల్వో కార్ ఇండియా వెల్లడించింది. అయితే ఇటీవల భారత మార్కెట్లోకి విడుదల చేసిన కాంపాక్ట్ లగ్జరీ సెడాన్ ఎస్60 మోడల్ ధరను మాత్రం పెంచలేదు. ఉత్పత్తి వ్యయాల ఆధారంగా ఈ ఏడాది చివర్లో మరోసారి ధరలు పెంచే విషయం పరిశీలిస్తామని తెలిపింది.