ఆందోళనలో వరంగల్ ఫ్రంట్ లైన్ వారియర్స్..

ABN , First Publish Date - 2021-01-27T19:29:22+05:30 IST

వరంగల్: వరంగల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళనలో ఉన్నారు. దీంతో కరోనా టీకా తీసుకున్న వారిలో ఆందోళన పెరుగుతోంది.

ఆందోళనలో వరంగల్ ఫ్రంట్ లైన్ వారియర్స్..

వరంగల్: వరంగల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళనలో ఉన్నారు. దీంతో కరోనా టీకా తీసుకున్న వారిలో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే వనిత అనే అంగన్ వాడి టీచర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురు శాయంపేట హెల్త్ సెంటర్‌లోనే తీసుకున్నట్టు గుర్తించారు. అదే సెంటర్‌లో టీకా తీసుకున్న మిగతా వారిలో ఆందోళన నెలకొంది. వైద్యాధికారులైతే వనిత మృతికి వ్యాక్సిన్ కారణం కాదంటున్నారు. ఎఫ్ఎస్ఎల్‌కు శాంపిల్స్‌ను పంపించారు. ఇన్నర్ ఫీలింగ్ వల్లే అస్వస్థతకు గురవుతున్నారని జిల్లా వైద్యాధికారి చెబుతున్నారు. మృతురాలి పోస్ట్ మార్టం నివేదిక వస్తే అసలు నిజాలు తెలుస్తాయని ప్రకటించారు.


Updated Date - 2021-01-27T19:29:22+05:30 IST