రాష్ట్రంలో 4 ఆస్పత్రుల్ని కరోనా కోసం కేటాయించాం: కన్నబాబు
ABN , First Publish Date - 2020-03-30T19:55:11+05:30 IST
రాష్ట్రంలో 4 ఆస్పత్రుల్ని కరోనా కోసం కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖలోని విమ్స్, కృష్ణాలో సిద్ధార్థ హాస్పిటల్, నెల్లూరులోని జీజీహెచ్, తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రుల్ని కేటాయించామని చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో 4 ఆస్పత్రుల్ని కరోనా కోసం కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖలోని విమ్స్, కృష్ణాలో సిద్ధార్థ హాస్పిటల్, నెల్లూరులోని జీజీహెచ్, తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రుల్ని కేటాయించామని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో నిరంతర సర్వే కొనసాగుతోందని, ప్రతి వార్డులో 2 టీమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైరస్ సోకిన వారిని ఆస్పత్రులకు తీసుకురావాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. 16,723 పడకలను క్వారంటైన్ కోసం సిద్ధం చేశామని కన్నబాబు తెలిపారు.