చచ్చేదాకా రోగులకు సేవ చేస్తాం

ABN , First Publish Date - 2020-07-05T07:34:57+05:30 IST

‘మేం చచ్చేంత వరకూ కరోనా రోగులకు సేవలందిస్తాం’..

చచ్చేదాకా రోగులకు సేవ చేస్తాం

  • గాంధీలో కన్నీళ్లు పెట్టుకున్న ఇద్దరు నర్సులు

అడ్డగుట్ట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘మేం చచ్చేంత వరకూ కరోనా రోగులకు సేవలందిస్తాం’.. గాంధీ ఆస్పత్రిలోని ఓ లిఫ్ట్‌ వద్ద నిల్చునే ఓపిక లేక కూలబడ్డ ఇద్దరు నర్సులు కన్నీరు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్య ఇది. తాము విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నామని.. కనీసం సెలవు కూడా ఇవ్వడం లేదని ఓ నర్సు ఆవేదన వ్యక్తం చేసింది. రోజంతా క్షణం తీరిక లేకుండా కరోనా రోగులకు సేవలు చేసి అలిసిపోయిన ఇద్దరు నర్సులు ఽగోడకు సాగిలపడి అలా చాలాసేపు కూర్చిండిపోయారు. ఈ తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

Updated Date - 2020-07-05T07:34:57+05:30 IST