ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-12-25T02:37:08+05:30 IST
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జగ్గారెడ్డి
హైదరాబాద్: ఇంటర్ ఫస్టియల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మినిమమ్ మార్కులతో విద్యార్థులను పాస్ చేసినందుకు జగ్గారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో మీడియా పాత్ర కీలకమని ఆయన చెప్పారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పోరాటం సక్సెస్ అయిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.