అన్నదాతల పక్షాన కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటాం
ABN , First Publish Date - 2022-01-15T09:34:54+05:30 IST
రైతాంగాన్ని రాబందుల్లా వేధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తూ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో విమర్శించారు.
కనీస అవగాహన లేని బీజేపీ నేతలు
బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రైతాంగాన్ని రాబందుల్లా వేధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తూ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బీజేపీ నేతలకు కనీస అవగాహనలేదన్నారు. రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. దేశంలోనే తొలిసారి రైతుబంధుతో పెట్టు బడిసాయం, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సాగు నీరు ఇచ్చి వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని పేర్కొన్నారు. విద్యుతు ్తకు మీటర్లు బిగించి, రాష్ర్టాలు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ట్ల కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్రం రైతుల నడ్డి విరుస్తోందన్నారు. ఎరువు ల ధరలను అమాంతం పెంచడం ద్వారా వ్యవసా యాన్ని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. రైతాంగాన్ని క్షోభకు గురిచేసి బీజేపీ పైశాచికానందం పొందుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు.