పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2020-12-14T02:04:18+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందులలో సీఎం జగన్‌ను ఓడిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు.

పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం: టీడీపీ నేతలు

తిరుపతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందులలో సీఎం జగన్‌ను ఓడిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. నాలుగుసార్లు ఓడిన పెద్దిరెడ్డికి కుప్పంలో చంద్రబాబును ఓడించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డికి సత్తా ఉంటే కుప్పం నుంచి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమెంతో తేలిపోతుందని హెచ్చరించారు. అంగళ్ల ఘటన వెనుక పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉండి అబద్దాలు చెప్పేందుకు పెద్దిరెడ్డికి సిగ్గుండాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ఇసుకమాఫియాను నడిపిస్తోందని చిత్తూరు టీడీపీ నేతలు ఆరోపించారు. 


వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. తాను దళిత వ్యతిరేకినని అంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని పెద్దిరెడ్డి విమర్శించారు. జడ్జి రామకృష్ణ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శంకర్, శ్రీనివాసులరెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారని చెప్పారు. 

Updated Date - 2020-12-14T02:04:18+05:30 IST