పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం: కేశినేని శ్వేత

ABN , First Publish Date - 2021-03-07T00:11:02+05:30 IST

పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ప్రకటించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం: కేశినేని శ్వేత

విజయవాడ: పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ప్రకటించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీలో గ్రూపు తగాదాలు లేవని తెలిపారు. వైసీపీ అరాచకాలను ఎండగట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏ పార్టీలోనైనా సమన్వయలోపం సహజమని కేశినేని శ్వేత వ్యాఖ్యానించారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని, కరోనా సమయంలోనూ ప్రజల కోసం పనిచేశామని తెలిపారు. ప్రజలు తమ కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తారని కేశినేని శ్వేత ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను టీడీపీ నగర మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. 11వ డివిజన్ నుంచి ఆమె కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. నగర నేతలు అందరి ఆమోదంతో ఆమె పేరును ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-03-07T00:11:02+05:30 IST