అర్హలందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-10-22T04:59:34+05:30 IST

అర్హలందరికీ సంక్షేమ పథకాలు

అర్హలందరికీ సంక్షేమ పథకాలు
సీఎం సహాయ నిధి చెక్కు అందజేస్తున్న మంత్రి

  • కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి


కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రానికి చెందిన మోటే రాజుకు మంజూరైన రూ.లక్ష సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గురువారం మంత్రి తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామారం సుజాత, నాయకులు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, మల్లేష్‌, బాల్‌రాజ్‌, సుమన్‌ బన్ని, రాగుల గణేష్‌, ప్రవీణ్‌, శివాజీ, మంగ, రమేష్‌ పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండల పరిధి ప్రతా్‌పసింగారంకు చెందిన బద్దం కుమార్‌ టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంత్రి మల్లారెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. కుమార్‌ను మంత్రి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రామానికి చెందిన అనుమల మోహన్‌రెడ్డిని పార్టీ మండల సంయుక్త కార్యదర్శిగా నియమించారు. కార్యక్రమంలో నాగులపల్లి రమేష్‌, సర్పంచ్‌ శివశంకర్‌, చంద్రమౌళి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:59:34+05:30 IST