భళా..యు ముంబా
ABN , First Publish Date - 2022-01-27T07:11:25+05:30 IST
ప్రొ. కబడ్డీ లీగ్లో బుధవారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 45-34 స్కోరుతో బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించింది.
బెంగళూరుపై ఘన విజయం
బెంగళూరు: ప్రొ. కబడ్డీ లీగ్లో బుధవారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 45-34 స్కోరుతో బెంగళూరు బుల్స్పై ఘన విజయం సాధించింది. అభిషేక్ సింగ్ 11 రైడ్ పాయింట్లతో అదరగొట్టగా.. డిఫెండర్ రాహుల్ సెత్పాల్ (8) సత్తాచాటాడు. మరో రైడర్ అజిత్ కుమార్ (8) కూడా మెరుపులు మెరిపించాడు. బెంగళూరు కెప్టెన్ పవన్ సెహ్రావత్ (14) సూపర్ టెన్తో రాణించినా అతడికి సహచరులనుంచి మద్దతు కరవైంది.