పాఠ్య పుస్తకాలు ఇచ్చేదెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-22T06:52:20+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండడం, ఫీజుల భారం లేకపోవడంతో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల

పాఠ్య పుస్తకాలు ఇచ్చేదెప్పుడు?

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండడం, ఫీజుల భారం లేకపోవడంతో  ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ, కొత్తగా చేరిన వారికి పాఠ్య పుస్తకాలు ఇంకా అందకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


గత ఏడాదితో పోలిస్తే సుమారు 4 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. వీరికి సైతం పుస్తకాలు అందించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు విద్యాశాఖను కోరుతున్నారు. కానీ, అదనపు పుస్తకాల ప్రచురణపై విద్యాశాఖ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


Updated Date - 2020-10-22T06:52:20+05:30 IST