మారేడుపల్లిలో భార్యాభర్తల అదృశ్యం
ABN , First Publish Date - 2021-01-12T12:05:01+05:30 IST
రమేశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
హైదరాబాద్ : మారేడుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో భార్యభర్తలు అదృశ్యమయ్యారు. మారేడుపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వ్యాపారి చింతలచెరువు రమేశ్ (54), మంజు((52) దంపతులు. గత జూన్లో వారి కుమారుడు గుండె నొప్పితో చనిపోయాడు. మనోవేదనకు గురైన దంపతులకు అనారోగ్య సమస్యలు తల్తెడంతో గత నవంబర్ 4వ తేదీన ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాలేదు. రమేశ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిస్తే మారేడుపల్లి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రవికుమార్ కోరారు.