కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: ముత్తిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-05T08:18:22+05:30 IST
తాను గుంట భూమిని కూడా ఆక్రమించలేదని, కబ్జా చేసినట్లు నిరూపిస్తే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు.
జనగామ, మే 4(ఆంధ్రజ్యోతి): తాను గుంట భూమిని కూడా ఆక్రమించలేదని, కబ్జా చేసినట్లు నిరూపిస్తే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. జనగామలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికంగా బతుకమ్మ కుంట, కుమ్మరికుంటలను కబ్జా చేసినట్లు, హన్మంతాపూర్లో 60 ఎకరాలు ఆక్రమించినట్లు సంజయ్ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ తన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాలకు ముక్కు రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితేనే నాగార్జునసాగర్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టారని విమర్శించారు.