జ్వరంతో ఉన్న మహిళపై దారుణం.. చూపు కోల్పోయిన బాధితురాలు!
ABN , First Publish Date - 2021-07-07T02:06:26+05:30 IST
మెడికల్ షాప్కు వెళ్లిన ఓ మహిళపై షాపు యజమాని దారుణానికి పాల్పడ్డాడు. జ్వరంతో ఉందని కూడా చూడకుండా మత్తుమందు ఇచ్చి పది రోజుల పాటు తన కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె తన కంటి చూపు కోల్పోయింది.
జైపూర్: మెడికల్ షాప్కు వెళ్లిన ఓ మహిళపై షాపు యజమాని దారుణానికి పాల్పడ్డాడు. జ్వరంతో ఉందని కూడా చూడకుండా మత్తుమందు ఇచ్చి పది రోజుల పాటు తన కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె తన కంటి చూపు కోల్పోయింది. రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు జూన్ 18న మందుల కోసం మెడికల్ షాప్కు వెళ్లింది. అయితే.. జ్వరం తగ్గే సూదిమందు ఇస్తానంటూ నమ్మబలికిన షాపు యజమాని ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తరువాత బాధితురాలిని అపహరించి డెహ్రాడూన్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ప్రయాత్నాలకు ఆమె అడ్డుపడకుండా ఉండేందుకు బాధితురాలికి పలు మార్లు మత్తుమందు ఇచ్చాడు. ఈ కమ్రంలో ఆమె చూపు కోల్పోయింది. జరిగిన దారుణం గురించి బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇటీవలే నిందితుడిని అరెస్టు చేశారు. మత్తుమందు ప్రభావం కారణంగానే ఆమె చూపు కోల్పోయిందని వైద్యులు చెప్పినట్టు స్థానిక ఎస్పీ వెల్లడించారు.