అత్యాచార యత్నం చేసిన కీచకుడిని కడతేర్చిన మహిళ

ABN , First Publish Date - 2020-10-17T15:52:43+05:30 IST

తనపై అత్యాచారం చేయబోయిన కీచకుడిని అపరకాళీ అయిన మహిళ కత్తితో పొడిచి చంపిన ఘటన...

అత్యాచార యత్నం చేసిన కీచకుడిని కడతేర్చిన మహిళ

25 కత్తిపోట్లు...మృతి...పోలీసులకు లొంగిపోయిన మహిళ

భోపాల్ (మధ్యప్రదేశ్) : తనపై అత్యాచారం చేయబోయిన కీచకుడిని అపరకాళీ అయిన మహిళ కత్తితో పొడిచి చంపిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో వెలుగుచూసింది.భోపాల్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని గుణ జిల్లా అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మ తనపై అత్యాచార యత్నం చేయబోగా అతన్ని వంటగదిలోని కత్తితో పొడిచి చంపానని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా 2005వ సంవత్సరంలో తన పొరుగింటి వ్యక్తి అయిన శర్మ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ గత 15 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని మహిళ పోలీసులకు చెప్పింది.


 శర్మ పెళ్లి అయ్యాక కూడా తనపై అత్యాచారం చేస్తున్నాడని మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త  వేరే జిల్లాలో పనిచేయడానికి వెళ్లగా మద్యం మత్తులో ఉన్న శర్మ తన ఇంటికి వచ్చి అత్యాచార యత్నం చేశాడని, దీంతో తాను వంటగదిలోని కత్తితో 25 పోట్లు పొడిచి చంపానని మహిళ అంగీకరించింది. 

Updated Date - 2020-10-17T15:52:43+05:30 IST