నాలుగు ఫ్లాట్లున్నా.. గుడి ముందు భిక్షాటన.. చివరికి కోడలి చేతిలో..

ABN , First Publish Date - 2020-07-18T02:13:41+05:30 IST

ఆమె పేరిట ముంబై మహానగరంలో నాలుగు ఫ్లాట్లున్నాయి. అయినాసరే ప్రతిరోజూ ఓ జైన దేవాలయం ముందు కూర్చొని భిక్షాటన చేస్తుంటుంది.

నాలుగు ఫ్లాట్లున్నా.. గుడి ముందు భిక్షాటన.. చివరికి కోడలి చేతిలో..

ముంబై: ఆమె పేరిట ముంబై మహానగరంలో నాలుగు ఫ్లాట్లున్నాయి. అయినాసరే ప్రతిరోజూ ఓ జైన దేవాలయం ముందు కూర్చొని భిక్షాటన చేస్తుంటుంది. ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య ఎప్పుడూ గొడవలే. ఈ తగాదాల కారణంగా ఆ కోడలు అత్తను హతమార్చింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. స్థానికంగా నివశించే ఓ 70ఏళ్ల బామ్మ కథ ఇది. ముంబైలో నాలుగు ఫ్లాట్లు కొన్న ఆమె.. మూడింటిని అద్దెలకిచ్చింది. ఒక దానిలో దత్తత తీసుకున్న తన కుమారుడి కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే ఈ నాలుగు ఫ్లాట్లు తన పేరున రాయాలని కోడలు గొడవ చేసేది. దీనికి ససేమిరా అనడంతో భయంకరమైన నిర్ణయం తీసుకున్న ఆ కోడలు.. అత్తను హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కోడల్ని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.

Updated Date - 2020-07-18T02:13:41+05:30 IST