మేడ్చల్లో మహిళ దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..
ABN , First Publish Date - 2021-04-04T15:43:16+05:30 IST
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్/మేడ్చల్ : మెడకు చున్నీ బిగించి ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుండ్లపోచంపల్లి మున్సిపల్ కండ్లకోయ పరిధిలోని ఓ ఇంట్లో జార్ఖండ్కు చెందిన సోనా ముని, త్రిలోక్ రెండు నెలల క్రితం అద్దెకు దిగారు. మేడ్చల్ చెక్పోస్టులోని ఓ చాక్లెట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో యజమాని స్థానికుల సహాయంతో తలుపులు తీసి చూడగా సోనా ముని (32) మృతదేహం కనిపించింది. మెడకు చున్నీ బిగించి హత్య చేశారని, రెండు, మూడు రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. త్రిలోక్ ఈ హత్య చేసి బయట తలుపులు పెట్టి పారిపోయి ఉండచ్చునని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.