బీసీసీఐకి కృతజ్ఞతలు: వేద

ABN , First Publish Date - 2021-05-19T08:24:28+05:30 IST

కరోనాతో తల్లి, సోదరిని కోల్పోయి బాధలో ఉన్న తనకు అండగా నిలిచిన బీసీసీఐతో పాటు బోర్డు కార్యదర్శి జై షాకు భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపింది...

బీసీసీఐకి కృతజ్ఞతలు: వేద

న్యూఢిల్లీ: కరోనాతో తల్లి, సోదరిని కోల్పోయి బాధలో ఉన్న తనకు అండగా నిలిచిన బీసీసీఐతో పాటు బోర్డు కార్యదర్శి జై షాకు భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపింది. ‘బాధలో ఉన్న నాకు కొద్దిరోజుల క్రితం బోర్డు అధికారులతో పాటు జై షా ఫోన్లో మాట్లాడి మద్దతుగా నిలిచారు. వారికి కృతజ్ఞతలు’ అని వేద మంగళవారం ట్వీట్‌ చేసింది. ఇలాంటి కఠిన పరిస్థితిల్లో వేదను  బీసీసీఐ కనీసం పలకరించలేదని ఆస్ర్టేలియా మహిళల మాజీ కెప్టెన్‌ లిసా స్థాలేకర్‌ విమర్శించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2021-05-19T08:24:28+05:30 IST