కార్మికులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
ABN , First Publish Date - 2021-04-17T05:24:49+05:30 IST
కార్మికులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
శామీర్పేట : గ్రామంలోని కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అలియాబాద్లో నివసించే భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ కోసం సొంతగా డబ్బులు చెల్లిస్తానన్నారు. ఇట్టి స్కీమ్లో చేరుటకు గ్రామ సీఐటీయూ నాయకుడు కిష్టప్ప సహకారం అందిస్తాడని ఈ సందర్భంగా తెలిపారు.