భారత్ కష్టాల పాలైతే ప్రపంచానికి కష్టాలు తప్పవ్
ABN , First Publish Date - 2021-05-07T06:17:35+05:30 IST
కొవిడ్ కారణంగా భారత్ త్రీవ కష్టాల్లో పడితే ప్రపంచానికీ తీవ్ర కష్టాలు తప్పవని అమెరికా-భారత వ్యాపార మండలి (యూఎ్సఐబీసీ) హెచ్చరించింది...
- యూఎస్ఐబీసీ
వాషింగ్టన్: కొవిడ్ కారణంగా భారత్ త్రీవ కష్టాల్లో పడితే ప్రపంచానికీ తీవ్ర కష్టాలు తప్పవని అమెరికా-భారత వ్యాపార మండలి (యూఎ్సఐబీసీ) హెచ్చరించింది. కొవిడ్పై పోరులో భారత్ది కీలక పాత్ర అని యూఎ స్ఐబీసీ అధ్యక్షురాలు నిశా దేశాయ్ బిశ్వాల్ స్పష్టం చేశారు. ‘భారత్ తీవ్ర కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ తీవ్ర కష్టాలు తప్పవు. అందుకే మనమందరం కలిసికట్టుగా భారత్కు మద్దతుగా నిలవాలి. అలా చేయడం ద్వారా కరోనా తదుపరి దశను అడ్డుకోవచ్చు’ అన్నారు. కరోనా పోరులో భారత్కు సాయపడేందుకు ఇప్పటికే 40 ప్రధాన అమెరికా కంపెనీల సీఈఓలు ప్రత్యేక టాస్క్ఫోర్స్గా ఏర్పడ్డారని పేర్కొన్నారు.