ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్.. ధర తెలిస్తే..
ABN , First Publish Date - 2021-04-23T02:34:18+05:30 IST
ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్.. ధర తెలిస్తే..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో షియోమి ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లో త్వరలో షియోమి ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 1,15,600 ఉంటుందని సంస్థ తెలిపింది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ రూ. 1,15,600, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ రూ. 1,27,000, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ మిక్స్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ రూ. 1,50,000 ఉంటుందని షియోమి సంస్థ తెలిపింది.