మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం
ABN , First Publish Date - 2021-01-17T04:46:42+05:30 IST
మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం
పరిగి: మనువాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామని టీఎ్సటీఎ్సఏ రాష్ట్ర కో-ఆర్డిటనేర్ టి.నరేషన్ అన్నారు. జనవరి 17న రోహిత్ వేముల నాలుగో వర్ధంతి సందర్భంగా శనివారం పరిగిలోని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోహిత్ను ఆర్ఎ్సఎస్, బీజేపీ, ఏబీవీపీలే బలి తీసుకున్నాయని ఆరోపించారు. 17న వరంగల్లో జరిగే రోహిత్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్, ప్రభు, నర్సింహులు, కలీమ్, సానాసయ్యద్ పాల్గొన్నారు.