కేంద్ర మంత్రులు నిర్మల, అనురాగ్‌ఠాకూర్‌తో మంత్రి బుగ్గన భేటీ

ABN , First Publish Date - 2020-09-24T19:39:29+05:30 IST

కేంద్ర మంత్రులు నిర్మల, అనురాగ్‌ఠాకూర్‌తో మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర మంత్రులు నిర్మల, అనురాగ్‌ఠాకూర్‌తో మంత్రి బుగ్గన భేటీ

ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని అంశాలు, రామాయపట్నం పోర్టు, పారిశ్రామిక రాయితీలు, ప్రత్యేక హోదా అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరామన్నారు. అలాగే పోలవరం పూర్తికి నిధులు విడుదల వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మల, అనురాగ్‌ఠాకూర్‌తో మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పోలవరానికి సంబంధించి రూ.760 కోట్ల బిల్లుల పున పరిశీలన చేయాలని చెప్పినట్లు తెలిపారు. జీఎస్టీ బకాయిల అంశంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఆప్షన్లపై చర్చించాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-09-24T19:39:29+05:30 IST