వైసీపీ ప్రభుత్వం దాచుకోవడమే పరమావధిగా పనిచేస్తోందని: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-28T21:10:20+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. వైసీపీ కేవలం దోచుకోవడం..దాచుకోవడమే పరమావధిగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆర్ధిక మూలాల

వైసీపీ ప్రభుత్వం దాచుకోవడమే పరమావధిగా పనిచేస్తోందని: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ద్వజమెత్తారు. వైసీపీ కేవలం దోచుకోవడం..దాచుకోవడమే పరమావధిగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతున్నారని, నరేగా డబ్బులను కేంద్రం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. పార్టీని వీడిన వారిని మళ్లీ చేర్చుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి వెళ్లారని, టీడీపీకి అండగా వెనకబడి వర్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, భవిష్యత్ నాయకత్వం పటిష్టపరిచేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని తెలిపారు. టీడీపీ ఒక ఫ్యాక్టరీ లాంటిదని, ఇక్కడ నాయకులై వేరే పార్టీలో మంత్రులుగా చేస్తున్నారని, మనం నమ్మి పదవులు ఇచ్చిన వారు నమ్మక ద్రోహం చేసిపోయారని మండిపడ్డారు. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వాళ్లు కూడా మనపై విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. పార్లమెంట్‌ల వారీగా కమిటీలు.. అనుబంధ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు.

Updated Date - 2020-05-28T21:10:20+05:30 IST