వైసీపీ నేతల దోపిడీకి అడ్డు అదుపులేకుండా పోయింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-08T23:05:56+05:30 IST

వైసీపీ నేతల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం

వైసీపీ నేతల దోపిడీకి అడ్డు అదుపులేకుండా పోయింది: చంద్రబాబు

చిత్తూరు: వైసీపీ నేతల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం సి.బండపల్లిలో చంద్రబాబు పర్యటించారు. సి.బండపల్లిలో వైసీపీ అక్రమ క్వారీలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖనిజ సంపదను దోచేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీనిని కేంద్ర అటవీశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు.


తొలిరోజైన గురువారం రామకుప్పం, కుప్పం మండలాల్లో పర్యటించిన చంద్రబాబు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ముగించారు. కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌసు ఆవరణలో ఏర్పాటుచేసిన బస్సులో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బస్సు దిగారు. నేరుగా ఏరియా ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించారు.

Updated Date - 2022-01-08T23:05:56+05:30 IST