ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2020-08-04T21:35:40+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల బరితెగించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు.

ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలు

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైసీపీ నేతల బరితెగించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు. అడ్డొచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. మహిళా సిబ్బంది పట్ల వైసీపీ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆసుపత్రి మేనేజ్‌మెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా పేషెంట్ నుంచి బిల్లు వసూలు చేయకుండా డిశ్చార్జి చేయాలని వైసీపీ నేతలు హుకుం జారీ చేశారు. ఆసుపత్రి మేనేజ్‌మెంట్ అందుకు అంగీకరించలేదు. దీంతో వైసీపీ నేతలు వీరంగం వేశారు. మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2020-08-04T21:35:40+05:30 IST