అనంతలో వైసీపీ మార్క్ పాలిటిక్స్
ABN , First Publish Date - 2021-03-09T23:38:31+05:30 IST
రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో వైసీపీ
అనంతపురం: రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో వైసీపీ మార్క్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థులు తిష్ట వేశారు. ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఏపీవోల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను వైసీపీ అభ్యర్థులు సేకరిస్తున్నారు. హిందూపురంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద 21వ వార్డు వైసీపీ అభ్యర్థి మారుతి రెడ్డి పోలింగ్ సిబ్బంది వివరాలను సేకరించారు. అయితే మీడియా వెళ్లడంతో అక్కడి నుంచి మారుతి రెడ్డి తిరిగి వెళ్ళిపోయారు.