హోంమంత్రి వద్ద జగన్ ఏం ప్రస్తావించారంటే..: మోపిదేవి
ABN , First Publish Date - 2020-09-23T22:47:13+05:30 IST
హోంమంత్రి వద్ద జగన్ ఏం ప్రస్తావించారంటే..: మోపిదేవి
అమరావతి: రాష్ట్ర సమస్యల పరిష్కారానికే సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారని ఎంపీ మోపిదేవి అన్నారు. అమరావతి కుంభకోణం, జడ్జీల వ్యవహారం, ఫైబర్ నెట్ అంశాలను సీఎం జగన్ హోంమంత్రి వద్ద ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలను వివరించారని తెలిపారు. వీటన్నింటిపైనా అమిత్షా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.