అమిత్ షాతో సీఎం జగన్ భేటీ పాజిటివ్గా జరిగింది: పిల్లి
ABN , First Publish Date - 2020-09-23T22:52:27+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం పాజిటివ్గా జరిగిందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. ‘పోలవరానికి నిధులు, ఏపీ విభజన
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం పాజిటివ్గా జరిగిందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ తెలిపారు. ‘పోలవరానికి నిధులు, ఏపీ విభజన చట్టంలోని అంశాలపై చర్చ జరిగింది. న్యాయవ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉంది? ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు. జడ్జిల ప్రవర్తనపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు రాకుండా చూడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది’ అని పిల్లి సుభాష్చంద్రబోస్ అభిప్రాయపడ్డారు.