యెరియప్ప
ABN , First Publish Date - 2020-10-24T22:00:47+05:30 IST
విజయదశమి రోజున కేరళ ప్రజలు చేసుకునే రెసిపీ ఇది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వంటకం తయారు చేస్తుంటారు.
విజయదశమి రోజున కేరళ ప్రజలు చేసుకునే రెసిపీ ఇది. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వంటకం తయారు చేస్తుంటారు.
కావలసినవి: బియ్యం - ఒకకప్పు, పెసర్లు - రెండు టీస్పూన్లు, మెంతులు - ఒక టీస్పూన్, కొబ్బరి తురుము - అరకప్పు, బెల్లం - అరకప్పు, యాలకులు - మూడు, రవ్వ - రెండు టీస్పూన్లు, నూనె - తగినంత.
తయారీ విధానం: ముందుగా బియ్యం, పెసర్లు, మెంతులను మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. కొబ్బరి తురుము, బెల్లం, యాలకులు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. నీళ్లు కొద్దిగా పోయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మిశ్రమం పలుచగా అవుతుంది.
ఈ మిశ్రమంలో కొద్దిగా రవ్వ కలిపితే యెరియప్పలు క్రిస్పీగా వస్తాయి. మిశ్రమం పలుచగా కాకుండా ఇడ్లీ పిండి మాదిరిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత ఈ మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని వేయాలి. చిన్నమంటపై రెండు వైపులా గోధుమ రంగులోకి మారే వరకువేగించాలి. బయటకు తీసిన తరువాత వెడల్పాటి మూతతో యెరియప్పలను ఒత్తాలి. ఇలా చేస్తే వాటికి పట్టిన ఎక్కువ నూనె పోతుంది.