సామాజిక సేవలో యువత ముందుండాలి
ABN , First Publish Date - 2020-08-13T10:02:33+05:30 IST
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కేశంపేట: సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పేర్కొన్నారు. మండలంలోని ఎక్లా్సఖాన్పేట గ్రామంలో బుధవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కేశంపేట, నందిగామ యువజన సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే క్రీడా సామగ్రిని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ యువత తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం నెహ్రూ యువ కేంద్రం సభ్యులు చింతకుంటపల్లి గ్రామంలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్ యాదవ్, చింతకుంటపల్లి సర్పంచ్ పార్వతమ్మ, ఎన్వైకే జిల్లా యువత కో-ఆర్డినేటర్ అంజయ్య, కేశంపేట, నందిగామ మండలాల కో-ఆర్డినేటర్లు రమే్షయాదవ్, శ్రీశైలం, టీఆర్ఎస్ యూత్ అధ్యక్ష్యుడు మురళీమోహన్, నవీన్కుమార్, మహేష్, రమేష్, సంజీవ్, మహేందర్, తులసిరామ్, శంకర్ పాల్గొన్నారు.