అమరావతి- కృష్ణా- కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై..

ABN , First Publish Date - 2021-01-27T21:31:51+05:30 IST

అమరావతి- కృష్ణా- కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై..

అమరావతి- కృష్ణా- కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై..

విజయవాడ: అమరావతి- కృష్ణా- కొల్లేరు చౌడు భూముల నివారణ ప్రాజెక్టుపై ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా-కొల్లేరు సాలినిటీ మిటిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట కంపెనీల రిజిస్ట్రార్ వద్ద ప్రభుత్వం నమోదు చేయించింది. రూ.50 కోట్ల మూలధనంతో వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉన్న కొల్లేరులోకి సముద్రపు నీరు చొచ్చుకుని రాకుండా చూసేందుకు వివిధ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.


Updated Date - 2021-01-27T21:31:51+05:30 IST