12వ రోజుకు చేరుకున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-31T13:35:45+05:30 IST
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల నుంచి మొదలై రంగాపూర్, జలాల్మియాపల్లి క్రాస్రోడ్డు, చీదేడ్, దాద్పల్లి మీదుగా యాచారం మండలం...
రంగారెడ్డి: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జాపాల నుంచి మొదలై రంగాపూర్, జలాల్మియాపల్లి క్రాస్రోడ్డు, చీదేడ్, దాద్పల్లి మీదుగా యాచారం మండలం మొండిగౌరెల్లి వరకు 15 కిలోమీటర్ల మేర కొనసాగింది. నేడు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మొండి గౌరెల్లి, నల్లబెల్లి, చింతపట్ల గ్రామాల మీదుగా నల్గొండ జిల్లా మాల్ కి పాదయాత్ర చేరుకోనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు మాల్ వన్ టౌన్ రోడ్ షోల్ పాల్గొననుంది.