శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర: బోండా ఉమా
ABN , First Publish Date - 2020-05-24T00:12:52+05:30 IST
శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది? అని ప్రశ్నించారు.
అమరావతి: శ్రీవారి ఆస్తులు చౌకగా కొట్టేయడానికి వైసీపీ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బోర్డు సభ్యులందరూ చర్చించి నిర్ణయం చేసేవాళ్లని తెలిపారు. శ్రీవారి ఆస్తులు పరిరక్షించే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకాల నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉమ మండిపడ్డారు.