వైఎస్ ఆశయాలను వైసీపీ సర్వనాశనం చేస్తోంది: నరసింహారావు
ABN , First Publish Date - 2020-07-08T22:01:12+05:30 IST
విజయవాడ: ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో వైఎస్ఆర్ 71వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, వైఎస్
విజయవాడ: ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో వైఎస్ఆర్ 71వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, వైఎస్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు మాట్లాడుతూ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చెందిన రంగులతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను వైసీపీ అడ్వటైజ్ మెంట్స్ ప్రకటనలుగా ఇవ్వడం తగదన్నారు. వైఎస్ ఆశయాలను వైసీపీ సర్వనాశనం చేస్తోందన్నారు. వైఎస్ సీఎంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు తలపాగా చుట్టుకుంది కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు రంగుల జెండాయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విడదీయరాని అనుబంధం ఉందని నరసింహారావు పేర్కొన్నారు.