Share News

AP Elections: అనంత జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు రౌడీయిజం..

ABN , Publish Date - Apr 28 , 2024 | 10:06 AM

అనంతపురం జిల్లా: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం ప్రదర్శించారు. అర్ధరాత్రి తోపుదుర్తి గ్రామంలో తన అనుచరులతో అలజడి రేపారు. తోపుదుర్తి గ్రామంలో టీడీపీ నేత బోయ లింగమయ్య, ఉరుముల వన్నూరుప్ప ఇంటిపై దాడి చేశారు.

AP Elections: అనంత జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు రౌడీయిజం..

అనంతపురం జిల్లా: రాప్తాడు వైసీపీ (YCP) ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Prakash Reddy) సోదరుడు రాజారెడ్డి (Raja Reddy) రౌడీయిజం ప్రదర్శించారు. అర్ధరాత్రి తోపుదుర్తి గ్రామంలో తన అనుచరులతో అలజడి రేపారు. తోపుదుర్తి గ్రామంలో టీడీపీ నేత (TDP Leader) బోయ లింగమయ్య (Boya Lingaiah), ఉరుముల వన్నూరుప్ప (Vannuruppa) ఇంటిపై దాడి చేశారు. గన్‌మెన్లు, అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. నరుకుతా కొడుకుల్లారా అంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగారు. రాజారెడ్డి బెదిరింపులను తాళలేక బాధితులు అరుపులు, కేకలు పెట్టారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. రాజారెడ్డి ఆగడాలకు అడ్డుకట్టు వేయాలంటూ టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కాగా రాజారెడ్డిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 11:10 AM