చంద్రబాబుతోనే ప్రజాసంక్షేమం

ABN, Publish Date - Feb 09 , 2024 | 12:23 AM

ధర్మవరం, ఫిబ్రవరి 8: చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశేసుధాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 37వ వార్డులో గురువారం వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- భవిష్యత్తుకు గ్యారెంటీలో టీడీపీ నాయకులు

ధర్మవరం, ఫిబ్రవరి 8: చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, పట్టణ అధ్యక్షుడు పరిశేసుధాకర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని 37వ వార్డులో గురువారం వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబుష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ మినీమేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భీమనేని ప్రసాద్‌నాయుడు, రాళ్లపల్లిషరీఫ్‌, మాధవరెడ్డి, శీలామూర్తి, కొత్తపేట ఆది, గోసల శ్రీరాములు, బడిగింజల రమణ, కరెంటు ఆది, కత్తుల బాబ్జీ, జనసేన పార్టీ మత్స్యకార విభాగపు రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెస్తశ్రీనివాసులు, తెలుగుమహిళలు పాల్గొన్నారు.

Updated at - Feb 09 , 2024 | 12:23 AM