Share News

TS Politics: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్!

ABN , Publish Date - Mar 15 , 2024 | 05:11 PM

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabba polls) ముందు ముఖ్య నేతల జంపింగ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్‌కు (BRS) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన సీనియర్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు వెలువడతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం ఎంపీ దయాకర్ కలిశారు. దీంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

TS Politics: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్!

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabba polls) ముందు ముఖ్య నేతల జంపింగ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్‌కు (BRS) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన సీనియర్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు వెలువడతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం ఎంపీ దయాకర్ కలిశారు. దీంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

దీంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా గత నాలుగైదు రోజులుగా ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు టికెట్ ఇస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

MLC Kavitha: ఏ క్షణమైనా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..?

AP Politics: బాబోయ్.. ఎంపీగా పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్‌!

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 05:39 PM