Share News

TS News: బీజేపీలో హీట్ పెంచుతున్న ఖమ్మం టికెట్

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:28 PM

బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.

TS News: బీజేపీలో హీట్ పెంచుతున్న ఖమ్మం టికెట్

ఖమ్మం: బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో ఖమ్మం టికెట్‌ను బీజేపీ పెండింగ్‌లో పెట్టింది. అయితే ఖమ్మం బీజేపీ టికెట్ తనదేనని జలగం వెంకట్రావు చెబుతున్నారు. ఖమ్మం టికెట్‌పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. టికెట్ ఎవరికనేది త్వరలో తెలుస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు. పొత్తుల అంశం పార్టీ పెద్దలు చూసుకుంటారన్న జలగం.. ఖమ్మం టికెట్ తనకే దక్కుతుందన్న విశ్వాస‌ం ఉందని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 03:28 PM