Share News

Amit Shah: సిద్దిపేటలో రేపు అమిత్ షా బహిరంగ సభ

ABN , Publish Date - Apr 24 , 2024 | 07:57 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Amit Shah: సిద్దిపేటలో రేపు  అమిత్ షా బహిరంగ సభ
BJP, Amit Shah

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై (Parliament Elections) కమలం పార్టీ (BJP) సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ (Telangana)లో బీజేపీ అగ్రనేతలు (BJP Top leaders) వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేట (Siddipet)లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెదక్ (Medak) బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘనందన్‌రావు (Raghunandanarao)కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. కాగా తెలంగాణలో ఐదు బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు.


కాగా గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. గురు, శుక్రవారాలు బన్సల్ తెలంగాణలో పర్యటిస్తారని పెద్ద సభలు, సమావేశాల కంటే డోర్ టు డోర్ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మే నెల 13వ తేదీ వరకు నిర్మాణాత్మకంగా ప్రచారం సాగుతుందని చెప్పారు.


ఎన్నిలకు కేవలం రెండు వారాలు ఉండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి పెట్టింది. వరుసగా పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వారానికి మూడు లేదా నాలుగు సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. సిద్ధిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీకాకుళంలో మహిళా సదస్సు.. పాల్గొననున్న చంద్రబాబు

డ్వాక్రాలకు 10 లక్షలుజ: చంద్రబాబు

జగన్‌కు మరో షాక్‌!

కడప జిల్లా కోర్టు గీత దాటింది!

Read Latest AP News and Telugu News

National News, Telangana News, Sports News

Updated Date - Apr 24 , 2024 | 08:29 AM