Home » Andhra Pradesh » Elections
రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి(మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. రాయలు వారు పరిపాలించిన నేల చంద్రగిరి అని తెలిపారు. ఇదే గడ్డపై దేశంలోకే విజనరీ లీడర్ అయిన తాను జన్మించానని తెలిపారు.
ట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. గురువారం రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో మే-13న సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) జరుగుండటంతో ఎన్నికల సంఘం (Election Commission) పలు నిబంధనలను విధించిన విషయం తెలిసిందే. అయితే.. అధికార వైసీపీ మాత్రం ఆ నియమాలను పాటించకుండా తుంగలో తొక్కుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో కొన్ని రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటనే ప్రజలు హతలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలింగ్ సమయాల్లో..
Andhrapradesh: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు సమాజం ముద్రగడను అసహ్యించుకుంటోందంటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం భీమవరంలో జనసేన కూటమి అభ్యర్థి అంజిబాబు తరుపున ఎన్నికల ప్రచారంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను దుమ్మెత్తిపోశారు.
Andhrapradesh: ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై కూటమి నేతలు భేటీ అయ్యారు. గురువారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన కూటమి నేతలు... రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిర్వహణపై మూడు పార్టీల నేతలు చర్చలు నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రధాని పర్యటన సాగనుంది.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి సమావేశమయ్యారు. భవిష్యత్లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను ఈ సందర్భంగా సుజనా వివరించారు. ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి బీజేపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ..