Home » International
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.
ఓ హోటల్లో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 10 మంది మృత్యువాత చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్(brazil) పోర్టో అలెగ్రే(Porto Alegre) నగరం గరోవా ఫ్లోరెస్టా హోటల్లోని మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు(womens) ఉద్యోగాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో ఫ్లైట్ అటెండెంట్గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అదే ఎయిర్లైన్స్కు అధ్యక్షులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్లో డాటా సైంటిస్ట్గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్లో లైన్లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
: విహారంలో విషాదం నెలకొంది. భర్తతో కలిసి పర్యటనకు వెళ్లిన భార్య ఫొటోల మీద ఉన్న క్రేజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ విషాద ఘటన ఇండోనేషియాలో జరిగింది.
తైవాన్(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
తమపై జరిపిన దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. తాను హెచ్చరించినట్టుగానే శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై మెరుపుదాడి చేసింది. అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్పై.. డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది.
ఇజ్రాయెల్ - ఇరాన్(Israeil - Iran) మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) శుక్రవారం తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు.